సినిమా వార్తలు

“రాజయోగం” సినిమా నుంచి సిధ్ శ్రీరామ్ పాడిన ‘రాసి పెట్టి ఉన్నట్టుందే..’ పాట విడుదల

సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రాజయోగం. ఈ చిత్రాన్ని శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మిస్తున్నారు. ఒక వైవిధ్యమైన కథాంశంతో దర్శకుడు రామ్ గణపతి రూపొందిస్తున్నారు. తుది హంగులు అద్దుకుంటున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

తాజాగా ఈ సినిమాలో సిధ్ శ్రీరామ్ పాడిన రాసి పెట్టి ఉన్నట్టుందే, రాజయోగం వచ్చేసిందే అనే పాటను దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు విడుదల చేశారు. పాట చాలా బాగుందన్న దర్శకేంద్రుడు చిత్ర టీమ్ కు బెస్ట్ విశెస్ తెలిపారు. ఈ పాటకు రెహమాన్ సాహిత్యాన్ని అందించగా అరుణ్ మురళీధరన్ సంగీతాన్ని అందించారు. రాసి పెట్టి ఉన్నట్టుందే, రాజయోగం వచ్చేసిందే నల్లనైన కన్నుల్లోకి వెన్నెలమ్మలా..అంటూ బ్యూటిఫుల్ రొమాంటిక్ నెంబర్ గా ఈ పాట సినిమాకు ఆకర్షణ కానుందని చిత్రబృందం చెబుతున్నారు.

అజయ్ ఘోష్, ప్రవీణ్, గిరి, భద్రం, షకలక శంకర్, తాగుబోతు రమేష్, చిత్రం శ్రీను, సిజ్జు, మధునందన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – విజయ్ సి కుమార్, ఎడిటర్ – కార్తీక శ్రీనివాస్, సంగీతం – అరుణ్ మురళీధరన్, డైలాగ్స్ – చింతపల్లి రమణ, పీఆర్వో – జీఎస్కే మీడియా, సహ నిర్మాతలు – డాక్టర్ శ్యామ్ లోహియా, నందకిషోర్ దారక్, నిర్మాత – మణి లక్ష్మణ్ రావు, రచన దర్శకత్వం – రామ్ గణపతి.