Thursday, April 25, 2024
Homeతెలుగు వార్తలు"రాజయోగం" సినిమా నుంచి సిధ్ శ్రీరామ్ పాడిన 'రాసి పెట్టి ఉన్నట్టుందే..' పాట విడుదల

“రాజయోగం” సినిమా నుంచి సిధ్ శ్రీరామ్ పాడిన ‘రాసి పెట్టి ఉన్నట్టుందే..’ పాట విడుదల

సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రాజయోగం. ఈ చిత్రాన్ని శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మిస్తున్నారు. ఒక వైవిధ్యమైన కథాంశంతో దర్శకుడు రామ్ గణపతి రూపొందిస్తున్నారు. తుది హంగులు అద్దుకుంటున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

- Advertisement -

తాజాగా ఈ సినిమాలో సిధ్ శ్రీరామ్ పాడిన రాసి పెట్టి ఉన్నట్టుందే, రాజయోగం వచ్చేసిందే అనే పాటను దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు విడుదల చేశారు. పాట చాలా బాగుందన్న దర్శకేంద్రుడు చిత్ర టీమ్ కు బెస్ట్ విశెస్ తెలిపారు. ఈ పాటకు రెహమాన్ సాహిత్యాన్ని అందించగా అరుణ్ మురళీధరన్ సంగీతాన్ని అందించారు. రాసి పెట్టి ఉన్నట్టుందే, రాజయోగం వచ్చేసిందే నల్లనైన కన్నుల్లోకి వెన్నెలమ్మలా..అంటూ బ్యూటిఫుల్ రొమాంటిక్ నెంబర్ గా ఈ పాట సినిమాకు ఆకర్షణ కానుందని చిత్రబృందం చెబుతున్నారు.

అజయ్ ఘోష్, ప్రవీణ్, గిరి, భద్రం, షకలక శంకర్, తాగుబోతు రమేష్, చిత్రం శ్రీను, సిజ్జు, మధునందన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – విజయ్ సి కుమార్, ఎడిటర్ – కార్తీక శ్రీనివాస్, సంగీతం – అరుణ్ మురళీధరన్, డైలాగ్స్ – చింతపల్లి రమణ, పీఆర్వో – జీఎస్కే మీడియా, సహ నిర్మాతలు – డాక్టర్ శ్యామ్ లోహియా, నందకిషోర్ దారక్, నిర్మాత – మణి లక్ష్మణ్ రావు, రచన దర్శకత్వం – రామ్ గణపతి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

Tollywood News

Most Read