Movie News

మన్మధుడు హీరోయిన్ రీ ఎంట్రీ ..

మన్మధుడు చిత్రంతో యూత్ ను కట్టిపడేసిన అన్షు అంబానీ…రీ ఎంట్రీ ఇస్తుంది. మన్మధుడు మూవీ ఈమె కనిపించింది కాసేపే అయినప్పటికీ యూత్ లో ఎప్పటికి గుర్తుండే పాత్రలో నటించింది. ఇప్పటికే ఈమె తాలూకా సీన్లు సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ మూవీ తర్వాత ప్రభాస్​తో రాఘవేంద్ర చిత్రంలోనూ మెరిసింది. అలా అప్పట్లో తన అందంతో యూత్​ను బానే ఆకట్టుకుంది. ఆ తర్వాత మిస్సమ్మలో గెస్ట్ రోల్, ఒక తమిళ సినిమాలోనూ నటించింది ఈ భామ.

కానీ అనంతరం సడెన్​గా సినిమాలకు గుడ్‌ బై చెప్పి ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయింది. మళ్లీ ఎక్కడా కనిపించలేదు. ఈ మధ్యే సోషల్ మీడియాలో మళ్లీ కనిపిస్తోంది. రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈమె.. తాను సినిమాలు ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో కారణాలను కూడా తెలిపింది. తాను ఇంగ్లాండ్​లో పుట్టి పెరిగినప్పటికీ తన పూర్వీకులు భారతదేశానికి చెందిన వారని తెలిపింది అన్షు. తనకు 16 ఏళ్లు ఉన్న సమయంలో ఇండియాకు వచ్చానని పేర్కొంది. అప్పుడే మన్మథుడు మూవీలో ఆఫర్‌ వచ్చిందని తెలిపింది. అలా కొన్ని చిత్రాలు చేసి మళ్ళీ అక్కడికి వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చింది.

అయితే అన్షు ప్రస్తుతం రీఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం. సందీప్ కిషన్ – త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో నటించే అవకాశం దక్కిందని తెలుస్తోంది. హాస్య మూవీస్ బ్యానర్​పై రాజేశ్​ దండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఒక కీలక పాత్ర కోసం అన్షుకు దర్శకుడు కథ చెప్పినట్లుగా సమాచారం. కథ , పాత్ర నచ్చడం వల్ల అన్షు సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. మరి చాల ఏళ్ల తర్వాత అన్షు రీ ఎంట్రీ ఇస్తుందనే వార్త అభిమానుల్లో సంతోషం నింపుతుంది.