Movie News

ఓటిటి లో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’

2014లో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ హిట్ చిత్రానికి సీక్వెల్ తీశారు. గీతాంజలి మళ్లీ వచ్చిందిలో కూడా హీరోయిన్ అంజలియే లీడ్ రోల్ పోషించడం విశేషం. నిజానికి మార్చి 22న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ముందు ప్రకటించారు. కానీ అదే తేదీకి శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ రిలీజ్ అవడంతో సినిమాను వాయిదా వేసి ఏప్రిల్ 11కి రిలీజ్ చేశారు.

శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, సునీల్, అలీ, రవిశంకర్, రాహుల్ మాధవ్ సహా ఇతరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. శివ తూర్లపాటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. థియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్‌ను ముందుకు రాబోతుంది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లోమే 08 నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. మరి థియేటర్స్ లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ మొవేయి ఓటిటి లో ఏ రేంజ్లో సందడి చేస్తుందో చూడాలి.