Friday, April 19, 2024
Homeతెలుగు వార్తలుపేదరోగులకు ఉచితంగా Covid-ఫ్లాస్మా

పేదరోగులకు ఉచితంగా Covid-ఫ్లాస్మా

పచ్చటి జీవితాలపై కర్కశ కరోనా పంజా విసుర్తూ చిన్నాభిన్నం చేస్తోంది. అందులో పేద రోగులు చికిత్స పొందడం గగనమవుతోంది. ఈ పరిస్థితుల్లో పేద రోగుల్ని కరోనా బారి నుంచి కాపాడేందుకు చిరంజీవి ఐ అండ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ సమాయత్తమైంది.

- Advertisement -

కరోనా సోకి రోగ విముక్తులైనవారు ఫ్లాస్మాదానం చేస్తే మరికొంతమందికి ఆయుష్షు పోసినట్లే. ఈ నేపధ్యంలో పేదలైన కరోనా సోకిన రోగులకు ఉచితంగా ఫ్లాస్మా వితరణ చేసేందుకు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ నిర్ణయం తీసుకుంది.

తెల్లరేషన్‌ కార్డుదారులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్‌ పేషెంట్లకు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ఉచితంగా ఫ్లాస్మా సరఫరా చేస్తోంది.

పేదలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాల్సిందిగా విన్నపం.

22 సంవత్సరాలుగా మెగాస్టార్‌ శ్రీ చిరంజీవిగారు సొంత నిధులు వెచ్చించి 9 లక్షల 27 వేల మంది పేద రోగులకు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా ఉచితంగా రక్తనిధులు అందించారన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసేందుకు మిక్కిలి సంతోషిస్తున్నాం.

CEO.,
Chiranjeevi Eye & Blood Bank

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

Tollywood News

Most Read