Saturday, April 27, 2024
Homeతెలుగు వార్తలుజగన్‌గారి బర్త్‌డే వేడుకలను రోజా చాలా కమిట్‌మెంట్‌తో నిర్వహించి విజయం సాధించింది

జగన్‌గారి బర్త్‌డే వేడుకలను రోజా చాలా కమిట్‌మెంట్‌తో నిర్వహించి విజయం సాధించింది

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ఆర్‌.కె రోజా భారీఎత్తున సీయం జగన్‌ బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. విజయవాడలో జరిగిన జన్మదిన వేడుకల్లో భాగంగా సినిమా పరిశ్రమకు చెందిన అనేకమంది సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరై జన్మదిన వేడుకలను విజయవంతం చేశారు. గతంలో రోజా జబర్దస్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ షోకి జడ్జ్‌గా వ్యవహరించి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

ఆ సమయంలో జబర్దస్‌ ఆర్టిస్ట్‌లతో ఉన్న పరిచయంతో రోజా వారందరిని విజయవాడకు ఆహ్వానించింది. ఈ సందర్భంగా మంత్రి ఆర్‌ కె రోజా ఎంతో కమిటెడ్‌గా నిర్వహించిన జగనన్న క్రీడా సంబరాల్లో విజేతలుగా నిలిచిన 300 మంది క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశారు. వారు గెలుపొందిన ఫ్రైజ్‌మనీని ప్రముఖ నటులు ఎలక్ట్రానిక్‌ మీడియా ముఖ్య సలహాదారులు అలీతో చెక్కులను పంపిణీ చేశారు. వీరే కాకుండా ప్రముఖ నటి హోస్ట్‌ అనసూయ, హైపర్‌ ఆది, మహేశ్, చలాకి చంటి, అధిరే అభి, రాకేశ్, ఐశ్వర్యలతో పాటు తదితరులు పాల్గొని సభను విజయవంతం చేశారు. అలీ మాట్లాడుతూ–‘‘ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న మంత్రి తన తోటి నటి అయిన రోజా గారి కమిట్‌మెంట్‌కి మేమందరం కదిలిపోయాం. ఆమె ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఈ స్టేజ్‌కి వచ్చారు. ఈ రోజు జగన్‌ గారి పుట్టినరోజు వేడుకలు మా అందరి ఆధ్వర్యంలో ముఖ్యంగా రోజా పెట్టిన ఎఫర్ట్‌కి తగినట్లుగా భారీ విజయాన్ని దక్కించుకోవటం ఎంతో ఆనందంగా ఉంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో కారుమూరి నాగేశ్వరరావు, అంబటి రాంబాబు, డొక్కా మాణిక్య వరప్రపాద్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read