Movie News

రత్నం మూవీ రివ్యూ

తమిళ్ హీరో విశాల్ నటించిన రత్నం మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విశాల్ తో భరణి, పూజా వంటి యాక్షన్ చిత్రాలను తెరకెక్కించిన హరి..ఈ చిత్రానికి డైరెక్ట్ చేయడం తో రత్నం మూవీ ఫై అందరిలో అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది చూద్దాం.

స్టోరీ :

ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లో ఈ మూవీ కథ మొదలవుతుంది. చిత్తూరులోని ఒక కూరగాయల మార్కెట్లో పనిచేసే రత్నం (విశాల్)కు చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతారు. అదే మార్కెట్‌లో ఉండే పన్నీర్ (సముద్రఖని) ను రత్నం ప్రాణాలకు తెగించి కాపాడతాడు.. ఫలితంగా ఒకర్ని చంపి జైలుకు కూడా వెళ్తాడు. దాంతో రత్నాన్ని సొంత కొడుకులా పెంచుకుంటాడు పనీర్. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రత్నం కోసం ఏదైనా చేస్తుంటాడు. అదే సమయంలో నగరి అమ్మాయి మల్లిక (ప్రియ భవాని శంకర్) ఓసారి నీట్ పరీక్ష రాసేందుకు చిత్తూరుకు వస్తుంది. ఆమెను చూసి ఇష్టపడతాడు. అంతలోనే ఆమెను చంపడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అప్పుడు ఆమెను వాళ్ల నుంచి కాపాడతాడు రత్నం. అసలు మల్లిక ను చంపాలనుకుంది ఎవరు..? మల్లిక కు రత్నం కు సంబంధం ఏంటి..? రత్నం బ్యాక్ గ్రౌండ్ ఏంటి ..? అనేది కథ.

ప్లస్ :

  • యాక్షన్ సీన్స్
  • విశాల్ పాత్ర
  • మురళీ శర్మ యాక్టింగ్

మైనస్ ;

  • రొటీన్ కథ
  • స్లో నేరేషన్
  • బోరింగ్ సన్నివేశాలు
  • సాంగ్స్
  • సినిమా నిడివి

ఫైనల్ : చూడకుండా ఉంటె బెటర్