Saturday, July 27, 2024
HomeMovie Newsవీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి ఎన్టీఆర్ భారీ విరాళం..

వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి ఎన్టీఆర్ భారీ విరాళం..

- Advertisement -

జూ. ఎన్టీఆర్ కు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఆయన క్రేజ్ ను వాడుకోవాలని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి కానీ ఆయన మాత్రం పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం సినిమాల ఫైనే ఫోకస్ చేసాడు. ప్రస్తుతం దేవర తో పాటు బాలీవుడ్ మూవీ వార్ 2 చేస్తున్నాడు. కాగా ఎన్టీఆర్ కు సంబదించిన ఓ వార్త ఆలస్యంగా బయటకు వచ్చి అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.

ఎన్టీఆర్ ఎంతో గొప్ప మానవతావాది. ఆపదలో వున్న వారికి తన వంతు సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. చిన్న సాయం చేసినా సరే గొప్పగా చెప్పుకునే ఈ రోజుల్లో పబ్లిసిటీకి దూరంగా ఉంటున్న హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ఆలయానికి ఆయన భారీ విరాళం ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గన్నపేటలో వేంచేసియున్న భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి ఎన్టీఆర్ రూ.12.50 లక్షలు విరాళం ఇచ్చారని సమాచారం. ఈ మేరకు విరాళం ఇచ్చినట్లుగా గుడి ఆవరణలో దాతల పేర్లను శిలాఫలకంపై రాయించారు . దానిపై ఎన్టీఆర్ , ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, కుమారులు భార్గవ్‌రామ్, అభయ్‌రామ్, తల్లి షాలిని పేర్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు ఎన్టీఆర్ ను ప్రశంసిస్తూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read