narasimhapuram

గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై.. పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాలతో కలిసి ‘శ్రీరాజ్ బళ్లా’ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నరసింహపురం’. పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు. సిరి హనుమంతు హీరోయిన్ గా నటిస్తుండగా.. వర్ధమాన నటి ఉష హీరో చెల్లెలు పాత్రలో నటించారు.

సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈసందర్భంగా దర్శకనిర్మాత శ్రీరాజ్ బళ్లా మాట్లాడుతూ.. “థియేటర్లు ఓపెన్ అవ్వడం ఆత్రంగా ఎదురు చూస్తున్న మేము “నరసింహపురం” చిత్రాన్ని ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. సెన్సార్ సభ్యులు సహా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. సినిమా ఇంత బాగా రావడానికి కారకులైన మా టీమ్ అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను” అన్నారు.