తెలుగు వార్తలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ‘సీడ్ గణేశా”(విత్తన గణేష్)

ఎంపీ.జోగినపల్లి సంతోష్ కుమార్ సౌజన్యంతో.. పర్యావరణానికి మేలు కలిగించి… వృక్ష సంపదకు శ్రీకారం చుట్టే ‘సీడ్ గణేశా’ ప్రతిమలను ‘మనం సైతం’ కాదంబరి కిరణ్ పలువురు ప్రముఖులకు స్వయంగా అందజేస్తున్నారు.
“చవితిని జరుపుకునేందుకు మీరు వినాయకుడినే మా ఇంటికి పంపారు..చాలా ఆనందంగా ఉన్నది”అని వారంతా ఆనందాన్ని వ్యక్తపరుస్తుంటే… చాలా సంతోషంగా ఉందని కాదంబరి తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను దేశవ్యాప్తం చేస్తున్న ‘సంతన్న’ పది కాలాలపాటు చల్లగా ఉండాలని కిరణ్ కోరుకున్నారు!!