సినిమా వార్తలు

రాజోలులోని మట్టపర్రులో డైరెక్టర్ సుకుమార్ నిర్మించిన ‘శ్రీ బండ్రెడ్డి తిరుపతినాయుడు పాఠశాల భవనం’ ప్రారంభం

తన సొంత గ్రామమైన మట్టపర్రులో తన తండ్రి కీ.శే. శ్రీ బండ్రెడ్డి తిరుపతినాయుడు పేరు మీద క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ పాఠశాల భవనం నిర్మించారు. ఈ భవనం ఆగస్ట్ 1, ఆదివారం రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సుకుమార్‌తో పాటు, ఆయన సతీమణి తబిత, ప్రముఖ రాజకీయ నాయకులు, సుకుమార్ సన్నిహితులు-స్నేహితులు పాల్గొన్నారు. కాగా, కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ కొరత లేకుండా గ్రామంలో రూ. 40 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించిన సుకుమార్, ఇప్పుడు ఈ పాఠశాల భవనం నిర్మించడంతో గ్రామ ప్రజలంతా సుకుమార్ మరియు ఆయన ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలిపారు.