Movie News

పవన్ కళ్యాణ్ ను ధోనితో పోల్చిన అంబటి రాయుడు

అంబటి రాయుడు ప్రస్తుతం జనసేన ప్రచారంలో బిజీ గా ఉన్నారు. ఆ మధ్య వైసీపీ లో చేరి..వెంటనే బయటకు వచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన లో చేరారు. ప్రస్తుతం జనసేన స్టార్ క్యాంపెయినర్ గా మారి వరుస పర్యటనలతో ఆకట్టుకుంటున్నారు. వైసీపీ పార్టీ ఫై , జగన్ ఫై విమర్శలు చేస్తూ ఓటర్లను కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని అడుగుతూనే..మరోపక్క పవన్ కళ్యాణ్ ఫై ప్రశంసలు కురిపిస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు.

శనివారం నాడు బాపట్ల జిల్లా రేపల్లెలో కూటమి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్‌తో పాటు రాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయుడు మాట్లాడుతూ.. ప్రజల్లో ఇంత క్రేజ్ క్రికెటర్ ధోనికి, పవన్ కళ్యాణ్‌కు మాత్రమే చూశానన్నారు. ఈ మాటలు విన్న పక్కనే ఉన్న పవన్ హ్యాపీగా ఫీలయ్యి నవ్వుకున్నారు. కూటమికి ఓటు వేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పవన్ ప్రజల కోసం వచ్చారని.. ప్రజల కోసమే పనిచేస్తారని చెప్పారు. మద్యం, డబ్బు ప్రలోబాలకు లొంగకుండా ఓట్లు వేయాలని నియోజకవర్గ ప్రజలకు రాయుడు సూచించారు. కూటమిని గెలిపించాలని మనస్ఫూర్తిగా నమస్కరించి అంబటి కోరారు.