Thursday, April 25, 2024
HomeUncategorizedగ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రముఖ నటుడు రాజా రవీంద్ర

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రముఖ నటుడు రాజా రవీంద్ర

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటి తులసి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు గండిపేట లోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటిన ప్రముఖ నటుడు రాజా రవీంద్ర.

- Advertisement -


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా అద్భుతమైనది రోజురోజుకు పెరుగుతున్న జనాభా వల్ల మనం నివసించడం కోసం మొక్కలను కూడా నరికివేసి ఇళ్లను కట్టుకుంటున్నాము కానీ వాటి స్థానంలో కొత్త మొక్కలు పెట్టడం కోసం ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు.


ఎందుకంటే మొక్కలు మనకు ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు పెంచడం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.


ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నటులు నిఖిల్; సునీల్ ; నవీన్ చంద్ర లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

Tollywood News

Most Read