Movie News

మెగా ఆఫర్ ను మిస్ చేసుకున్న యంగ్ హీరోయిన్..

చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఛాన్స్ వస్తుందంటే ఎవ్వరు వద్దనుకోరు. అలాంటిది యంగ్ హీరోయిన్ చిరు ఆఫర్ ను రిజక్ట్ చేసింది. ఫిదా తో అందర్నీ ఫిదా చేసిన సాయి పల్లవి..మెగా ఆఫర్ కు నో చెప్పింది. ఆమె నో చెప్పడం తో మేకర్స్ షాక్ అయ్యారు. ఇక నేరుగా సాయిపల్లవిని చిరంజీవి మాట్లాడి.. ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారు. దాంతో ఆమె మరోసారి ఆఫర్‌ను తిరస్కరించింది. తాను మీకు చెల్లెలి పాత్రలో నటించలేను. మీ పక్కన హీరోయిన్‌గా నటించాలి. డ్యాన్సులు, స్టెప్పులు వేయాలనే కోరిక ఉంది. అందుకే నేను రిజెక్ట్ చేశాను అని సాయిపల్లవి వెల్లడించిందంట. సాయిపల్లవికి రోల్ ఆఫర్ చేసిన విషయాన్ని స్వయంగా లవ్ స్టోరీ సినిమా ఫంక్షన్‌లో చిరంజీవి స్వయంగా చెప్పారు. ఆ వేదికపై తన వెర్షన్‌ను క్లారిటీతో చెప్పింది. చెల్లెలి పాత్రను ఆమె వదులుకోవడంతో ఆ రోల్ కీర్తిసురేష్‌కు దక్కింది. ఆ సినిమానే భోళాశంకర్. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే.

ఇక ప్రస్తుతం చిరంజీవి బింబిసార ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి డైరెక్షన్లో ‘విశ్వంభర’ మూవీ చేస్తున్నాడు. వీఎఫ్​ఎక్స్, సోసియో ఫ్యాంటసీ జానర్​గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతూ వస్తుంది. రీసెంట్ గా హైదరాబాద్​లో తాజాగా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్​లో హై వోల్టేజ్ ఇంటర్వెల్ బ్లాక్ సన్నివేశాలు షూట్ చేసినట్లు సమాచారం. కాగా ఈ మూవీ లో చిరంజీవి డ్యుయల్ రోల్ చేస్తున్నారనే ఓ వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

ఈ రెండో క్యారెక్టర్ ప్రీ ఇంటర్వెల్ సన్నివేశంలోనే రివీల్ కానుందట. దీన్ని భారీ యాక్షన్ సీన్స్​తో ఎలివేషన్, ఫ్యామిలీ ఎమోషన్స్​ను టచ్​ చేస్తూ, రెండో పాత్రను పరిచయం చేయనున్నారట. ఈ సీన్ సినిమాకే హైలైట్​గా నిలవనుందట. ఇక ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తోంది. యంగ్ బ్యూటీ రమ్య పసుపలేటి, ఈషా చావ్లా, అశ్రిత వేముగంటి నందూరి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు రూ.150 నుంచి రూ.200 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2024 జనవరి 10న విడుదల చేయబోతున్నారు.