Movie News

‘విశ్వంభర’ డబ్బింగ్ స్టార్ట్..?

చిరంజీవి , త్రిష జంటగా వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ కథతో భారీగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందని నిన్నటి వరకు అంత నుకున్నారు కానీ ఈరోజు ఈ మూవీ డబ్బింగ్ స్టార్ట్ అని మేకర్స్ తెలిపే సరికి అప్పుడే షూటింగ్ పూర్తి అయ్యిందా అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈరోజు సినిమా డబ్బింగ్ వర్క్ పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టినట్టు పలు ఫొటోలు షేర్ చేసి మూవీ యూనిట్ తెలిపింది.

అయితే ఓ పక్కన మూవీ షూటింగ్ చేస్తూనే మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేయనున్నారు. ఇప్పటివరకు పూర్తయినంతవరకు డబ్బింగ్ చేయిస్తారని తెలుస్తుంది. ఒకేసారి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ జరిగితే మరింత ఫాస్ట్ గా సినిమా పూర్తవుతుందని, చెప్పిన టైంకి రిలీజ్ చేస్తామని భావిస్తున్నారు. విశ్వంభర సినిమా వచ్చే సంక్రాంతి బరిలో 2025 జనవరి 10న రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు మూవీ యూనిట్. ఇంత ఫాస్ట్ గా వర్క్ జరగడం, అప్పుడప్పుడు సెట్స్ నుంచి ఫొటోలు విడుదల చేయడం, ఇలా అప్డేట్స్ ఇవ్వడంపై మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.