నేటి సమాజానికి ఎంతో అవసరమైన మెసేజ్ అందిస్తూ రమేష్ ఉప్పు (RSU) హీరోగా, లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘వీడే మన వారసుడు’. రమేష్ ఉప్పు (RSU) కథ, స్క్రీన్ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మల్టీటాలెంట్ చూపిస్తున్న రమేష్ ఉప్పును దర్శకరత్న దాసరితో పోల్చారు పాల్గొన్న అతిథులు.
సమ్మెట గాంధీ, దేవసేన (వెంకటగిరి), విజయ రంగరాజు, ఆనంద్ భారతి, గూడూరు కిషోర్, శిల్ప (వైజాగ్) కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం జూలై 18న తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయబోతున్నట్టు చిత్ర దర్శకనిర్మాత రమేష్ ఉప్పు తెలిపారు.
ముఖ్య అతిథి MLA మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. “అంతా తానే అయి సినిమాను తీసిన ఉప్పు రమేష్ ను అభినందిస్తున్నాను. రమేష్ ఉప్పు 1994లో నాకోసం పాటలు చేసేవారు. ప్రతిభ ఉన్న కళాకారుడు. ఆయన కలలు నెరవేరాలని కోరుకుంటున్నాను. ఒకప్పుడు మెసేజ్ సినిమాలు వచ్చేవి.. ఆ తరహాలో ఈ సినిమాను హిట్ చేయాలని కోరుకుంటున్నాను.” అని అన్నారు.
30 ఇయర్స్ పృథ్వి మాట్లాడుతూ.. ఈ సినిమా ను సూపర్ హిట్ చేయాలనీ కోరుకుంటున్నాను.
కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ… ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ చూసాను. చాలా బాగా వచ్చాయి. చినుకు చినుకు సంద్రం అయినట్టు ఈ వేడుకకు వచ్చిన ప్రతీ ఒక్కరు ఈ సినిమా గురించి ప్రమోట్ చేయండి. ఈ సినిమా టీం అంతా బాగా చేశారు. అందరికి శుభాకాంక్షలు” అని అన్నారు.
డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. “ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఒంటరిగా సినిమాల్లో వచ్చిన రమేష్ ఉప్పు.. అసలైన సినీ వారసుడిగా కోరుకుంటున్నాను.” అని అన్నారు.
దర్శకుడు సముద్ర మాట్లాడుతూ.. “చిత్ర యూనిట్ సభ్యలకు ముందస్తు శుభాకాంక్షలు. సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది.” అని అన్నారు.
పోలీసు ఆఫీసర్ రామావత్ తేజ మాట్లాడుతూ… “ఈ సినిమాను హిట్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. సినిమాను హిట్టు చేయాలని ఇక్కడికి అందరు న్యాయ బద్దంగా వచ్చారు. నేను చట్ట బద్దంగా వచ్చాను. సినిమా హిట్ అయి తీరుతుంది. ” అని అన్నారు.
హీరో కృష్ణసాయి మాట్లాడుతూ.. సినిమా రంగంలో అనేక శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న రమేష్ ఉప్పును దర్శకరత్న దాసరితో పోల్చి అభినందనలు తెలిపారు.

ఈ వేడుకలో MLA మల్ రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి, పోలీస్ ఆఫీసర్ రామావత్ తేజ, దర్శకుడు సముద్ర, డైరెక్టర్ వీఎన్ ఆదిత్య, 30 ఇయర్స్ పృథ్వి, హీరో కృష్ణసాయి, దిల్ రమేష్ , జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ నవీన్ నటుడు నాగ మహేష్, నటుడు, దర్శకనిర్మాత సాయి వెంకట్, తదితరులు పాల్గొని సినిమా హిట్ కావాలని విష్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత రమేష్ ఉప్పు (RSU) మాట్లాడుతూ.. “మా చిత్ర యూనిట్ ను ఆశీర్వదించడానికి వచ్చిన సినీ రాజకీయ ప్రముఖులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సమాజానికి మంచి సందేశం అందిస్తుంది మా సినిమా. ఇందులోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరిని కదిలిస్తాయి. రైతుల కష్టాలను అర్థవంతంగా ఆవిష్కరించిన ఈ కుటుంబ కథా చిత్రాన్ని థియేటర్కు వెళ్లి చూడాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నాను.” అని చెప్పారు.
హీరోయిన్లు లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ మాట్లాడుతూ.. “రమేష్ ఉప్పు గారు ఒక మంచి సినిమాను తెరకెక్కించారు. ఇందులో అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉంది. గ్రామీణ ప్రాంతంలో షూటింగ్ జరిగింది. అక్కడి మనుషులు, వాతావరణం ఎంతో బాగుండేది ఎంతో బాగుండేది. సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం మాకు ఉంది.” అని చెప్పారు.
తారాగణం: హీరో – రమేష్ ఉప్పు, హీరోయిన్లు లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్. ఇతర కీలక పాత్రల్లో సమ్మెట గాంధీ, దేవసేన (వెంకటగిరి),
విజయ రంగరాజు, ఆనంద్ భారతి, గూడూరు కిషోర్, శిల్ప (వైజాగ్), సిద్ధు రాయల్, అద్వితేజ్ రెడ్డి తదితరులు నటించారు.