Movie News

పవన్ గెలుపుతో మొక్కు తీర్చుకున్న త్రివిక్రమ్

ప్రముఖ దర్శకుడు, మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లారు. త్రివిక్రమ్ తో పాటు ఆయన భార్య, కుమారుడు ఇతర కుటుంబ సభ్యులు ఆ ఏడు కొండల వెంకటేశ్వర స్వామివారి సన్నిధికి కాలినడకన వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకున్నారు.

సోమవారం రాత్రి తన భార్య సౌజన్య, కుమారుడు రిషితో కలిసి కాలినడకన తిరుమల చేరుకున్నారు. రాత్రి తిరుమలలోనే బసచేసి మంగళవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో తితిదే అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

కాగా త్రివిక్రమ్ సతీమణి సౌజన్య పలుమార్లు కనిపించినా పిల్లలు మాత్రం అసలు కనిపించరు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ కుమారుడు కూడా తాజా వీడియోలో కనిపించాడు. రిషి మంచి హైట్, కళ్లజోడు పెట్టుకుని అచ్చం నాన్నలా స్టైలిష్ గా కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. త్రివిక్రమ్ కుమారుడు హీరోలా ఉన్నాడంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించడం..ఉప ముఖ్యమంత్రి తో పాటు పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తుండడం తో త్రివిక్రమ్ మొక్కులు చెల్లించుకున్నారని అభిమానులు అంటున్నారు.

#trivikram ❤️ pic.twitter.com/fT20esWkgL— Saikumar Devendla (@saidevendla) June 17, 2024