Movie News

నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ ఇంట విషాదం

టాలీవుడ్ ఇండస్ట్రీ లో విషాదం నెలకొంది. ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ చినబాబు తల్లి నాగమ్మ కన్నుమూశారు. గత కొంతకాలంగా చిత్రసీమలో వరుస విషాద సంఘటనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. అనారోగ్యం, రోడ్డు ప్రమాదం, ఆత్మహత్య, గుండె పోటు వంటి కారణాలతో ప్రముఖులు తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు. ఇక ఇప్పుడు హారిక హాసిని నిర్మాణ సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ తల్లి నాగేంద్రమ్మ(90) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హృదయ సంబంధిత వ్యాధితో గురువారం తుదిశ్వాస విడిచారు.

సూర్యదేవర నాగేంద్రమ్మ కు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. రాధాకృష్ణ రెండో కుమారుడు కాగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీకి ఆమె నాయనమ్మ అవుతారు. రేపు(మే 31) ఉదయం పది గంటలకు ఫిల్మ్ నగర్‌లోని శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే సూర్యదేవర నాగవంశీ నిర్మించిన గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి ఈ శుక్రవారమే థియేటర్లలో విడుదల కానుంది. ఈ సమయంలోనే వారి కుటుంబంలో విషాదం చోటుచేసుకోవడం అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేస్తుంది. ఈ వార్త తెలిసి సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.