Movie News

సుధీర్ కూడా పాన్ ఇండియా స్టార్ అయ్యేందుకు సిద్దమయ్యాడు

ఇటీవల కాలంలో ప్రతి ఒక్క హీరో పాన్ ఇండియా సినిమా చేస్తూ తమ మార్కెట్ ను తమ పాపులార్టీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ , అల్లు అర్జున్ , రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా తదితరులు పాన్ ఇండియా స్టార్స్ గా పేరు తెచ్చుకోగా..ఇప్పుడు సుధీర్ బాబు సైతం పాన్ ఇండియా లో అడుగుపెడుతున్నారు. సుధీర్ సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌లో న‌టించ‌బోతున్నాడట. ఇది సుధీర్ బాబు కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్ చిత్రంగా రూపొంద‌నుందని సమాచారం.

ఓ అద్భుత‌మైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఆడియెన్స్‌కి అందించేలా, విజువల్ వండర్‌లా, లార్జ‌ర్ దేన్ లైఫ్ స్టోరీ లైన్‌తో ఇప్పటి వరకు చూడనటువంటి విభిన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రాబోతోందట. వెంట్ క‌ళ్యాణ్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రంతో తన సత్తాను చాటబోతోన్నాడని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ మేకర్లు భాగస్వామ్యం అయ్యారు. రుస్తుం, టాయ్‌లెట్‌: ఏక్ ప్రేమ్ క‌థ‌, ప్యాడ్ మ్యాన్‌, ప‌రి వంటి డిఫరంట్ కాన్సెప్ట్, బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన ప్రేర‌ణ అరోరా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ మిస్టరీ థ్రిల్ల‌ర్‌లో సుధీర్ బాబు కొత్తగా కనిపించబోతోన్నాడని అంటున్నారు. త్వ‌ర‌లోనే చిత్ర యూనిట్‌తో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ జాయిన్ కానుంది. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది శివ‌రాత్రి స్పెషల్‌గా మార్చిలో విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కుట్ర, ప‌న్నాగాలు క‌ల‌గ‌లిసిన చెడుకి, మంచి జ‌రిగే యుద్ధంగా ఇండియ‌న్ సినిమాల్లో ఓ మైల్ స్టోన్ మూవీలా ఈ ప్రాజెక్ట్ నిలవనుందట. మరి ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో..సుధీర్ కు ఎంత పేరు తీసుకొస్తుందో చూడాలి.