Friday, October 18, 2024
HomeMovie Newsశ్రీదేవికి మూడో కూతురు ఎవరో తెలుసా..?

శ్రీదేవికి మూడో కూతురు ఎవరో తెలుసా..?

- Advertisement -

దివంగత శ్రీదేవి, బోనీ కపూర్‌ జంటకు ఇద్దరు కూతుర్లు జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్‌ ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయం. వీరిద్దరే కాకుండా శ్రీదేవికి మరో కుమార్తె కూడా ఉందని మీకు తెలుసా..? శ్రీదేవి నిర్మాత బోనీకపూర్ ను ప్రేమించి పెళ్ళాడింది. వీరికి ఇద్దరు కూమార్తెలు.. పెద్దకూతురు జాన్వీ కపూర్ కాగా.. రెండో కూతురు ఖుషీకపూర్. వీరిద్దరు పెరిగి పెద్దవారై.. హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తారు అనుకున్న టైమ్ లో శ్రీదేవి మరణించింది. జాన్వీ కపూర్ స్క్రీన్ ఎంట్రీ చూడకుండానే ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. అయితే శ్రీదేవి మరణించిన ఏడాదే జాన్వీ ధడక్ సినిమాతో బాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవికి ఇద్దరు కూతర్లే అని అంతా అనుకుంటుండగా.. ఆమెకు మూడో కూతురు కూడా ఉందని తాజా సమాచారం. ఆమె ఎవరో కాదు సజల్. అవును శ్రీదేవి చివరిగా నటించిన మామ్ సినిమాలో.. శ్రీదేవి కూతురుగా నటించింది సజల్. అయితే ఈసినిమా షూటింగ్ టైమ్ లో వీరి బంధం బలపడిందట. శ్రీదేవి కూడా ఈసినిమా టైమ్ లో నాకు సజల్ మూడో కూతురితో సమానం.

తనతో నాకు అంతలా బాండింగ్ ఏర్పడింది అని చెప్పారు. సజల్ తల్లి మరణించడంతో.. తనను కూతురిగా భావించినట్టు శ్రీదేవి తెలిపారు. ఈసినిమా టైమ్ లో సజల్ శ్రీదేవికి బిడ్డగా దగ్గరయ్యింది. మరణించిన తన తల్లిని శ్రీదేవిలో చూసుకునేది సజల్. ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినసజల్ శ్రీదేవి మరణం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. తన తల్లి మరణించాక.. శ్రీదేవిలో అమ్మను చూసుకున్నాను. కాని దేవుడు ఈ అమ్మను కూడా దూరం చేశాడు అంటూ బాధపడింది. “సజల్ నాకు మూడో సంతానం లాంటిది. “ఇప్పుడు నాకు మరో కూతురు ఉన్నట్లు అనిపిస్తుంది అని శ్రీదేవి అనేవారని సజల్ గుర్తు చేసింది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read