Movie News

శ్రీ సత్య ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా..?

సీరియల్ నటి శ్రీ సత్య ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే వార్త ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. మోడల్‌గా కెరియర్ ప్రారంభించిన ఈ చిన్నది.. తనదైన అందచందాలతో మాయ చేసి మిస్ ఆంధ్రాగా గెలిచింది. దీంతో ఆమెకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. అలా చాలా బ్రాండ్లకు పని చేసింది. ఆ తర్వాత ‘నేను శైలజ’ సినిమాలో రామ్‌ గర్ల్‌ఫ్రెండ్‌గా చేసింది. ఆ తర్వాత ‘గోదావరి నవ్వింది’, ‘లవ్ స్కెచ్’ మూవీల్లో నటించింది.

చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసినా శ్రీ సత్యకు గుర్తింపు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆమె ‘ముద్ద మందారం’ సీరియల్ ద్వారా బుల్లితెరపైకి కూడా అడుగు పెట్టింది. ఆ తర్వాత ‘నిన్నే పెళ్లాడుతా’, ‘అత్తారింట్లో అక్కాచెల్లెలు’, ‘త్రినయని’ వంటి సీరియల్స్‌తో అలరించింది. అలాగే, కొన్ని షార్ట్ ఫిల్మ్‌ల్లోనూ నటించి శ్రీ సత్య తెలుగు రాష్ట్రాల్లో మంచిగా ఫేమస్ అయింది. బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ దక్కింది. ఇందులోకి సాదాసీదాగానే అడుగు పెట్టిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో మెప్పించింది. ఇలా ఫినాలే వీక్ వరకూ వచ్చి మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యింది. ఇక సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది..తాజాగా షేర్ చేసిన ఫొటోస్ లలో శ్రీ సత్య ముఖంలో ప్రధానమైన మార్పు కనిపిస్తోంది. ఈ విషయాన్ని నెటిజన్లు హైలైట్ చేస్తూ తమదైన రీతిలో కామెంట్లు పెడుతున్నారు. ఆమె పెదాలు గతంలో మాదిరిగా కాకుండా రూపం మారినట్లుగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ తెలుగు పిల్ల వాటికి సర్జరీ చేయించుకుందని ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. మరి నిజంగా చేయించుకుందా…? లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.