News

బాలీవుడ్ బాట పడుతున్న సౌత్ భామలు

టాలీవుడ్ లోకి బాలీవుడ్ భామలు ఎంట్రీ ఇస్తుంటే..సౌత్ భామలు మాత్రం బాలీవుడ్ బాట పడుతున్నారు. సమంత , సాయి పల్లవి , రష్మిక వంటి సౌత్ భామలు వరుసగా హిందీలో సినిమాలు చేస్తూ బిజీ గా మారుతున్నారు. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కనున్న చిత్రంతో సాయి పల్లవి బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీతో జునైద్ ఖాన్ వెండితెరకు పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం విదేశీ షెడ్యూల్ షూటింగ్​లో ఈ మూవీ టీమ్ ఉంది. ఈ మూవీ షూటింగ్ లో ఉండగానే..సాయి పల్లవి ‘రామాయణం’ మూవీ లో సీతగా కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీకి చెందిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక సమంత ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్​​తో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత పాన్ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లో ఐటమ్ సాంగ్​తో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఇప్పుడు ‘సిటాడెల్’ తో గ్లోబల్ లెవెల్​లో తన టాలెంట్ నిరూపించుకోనుంది. రస్సో బ్రదర్స్ డైరెక్షన్​లో వరుణ్ ధావన్ సరసన నటిస్తుంది. మరికొన్ని కూడా బాలీవుడ్ మూవీస్ కథలు వింటుందని సమాచారం.

మహానటి తో తెలుగు ఆడియన్స్ ను మెప్పించిన కీర్తి సురేష్..సైతం బాలీవుడ్ లో బిజీ కావాలని చూస్తుంది. ప్రస్తుతం ఈమె ‘బాబీ జాన్’ అనే మూవీతో చేస్తుంది. ఈ చిత్రం మే 31న థియేటర్లలో విడుదల కానుంది. పుష్ప ఫేమ్ రష్మిక సైతం 2022లోనే ‘గుడ్ బై’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక అంతకుముందే ‘పుష్ప’తో అక్కడి ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’ సినిమాల్లో పాత్రలు పెద్దగా గుర్తింపు ఇవ్వకపోయినా గత ఏడాది సూపర్ హిట్ ‘యానిమాల్’ మాత్రం నటిగా మరో స్థాయికి తీసుకువెళ్లింది. ప్రస్తుతం రెండు భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో రష్మిక నటిస్తుంది. ఒకటి సల్మాన్ ఖాన్ తో నటిస్తున్న ‘సికందర్’ కాగా, మరొకటి విక్కీ కౌశల్ నటిస్తున్న హిస్టారికల్ డ్రామా ‘చావా’ లో నటిస్తుంది. ఇలా సౌత్ భామలంతా బాలీవుడ్ బాట పడుతుంటే..నార్త్ భామలు మాత్రం సౌత్ సినిమాల ఫై ఫోకస్ చేస్తున్నారు.