Movie News

చైతు – శోభిత ల ఫ్యామిలీ పిక్

నాగచైతన్య- నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం గురువారం గ్రాండ్​గా ఎంగేజ్మెంట్ జరిగింది. దీంతో ఫ్యాన్స్ పెళ్లి ఎప్పుడు..శోభిత ఫ్యామిలీ ఎక్కడ అంటూ ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇరు ఫ్యామిలీల పిక్స్ షేర్ చేసి అందరి ప్రశ్నలకు చెక్ పెట్టారు. తాజాగా బయటకు వచ్చిన ఫోటోలలో అక్కినేని అమల, అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, శోభిత కలిసి దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది.

నిన్నటి వరకు నాగచైతన్య శోభిత నిశ్చితార్థానికి అఖిల్ , అమలా రాలేదంటూ రూమర్స్ స్ప్రెడ్ అవ్వడమే కాదు ఏవేవో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఈ ఫోటోలు కాస్త బయటకు రావడంతో ఆ రూమర్స్ అన్నిటికి చెక్ పడింది అని చెప్పవచ్చు. అక్కినేని ఫ్యామిలీ శోభితాను తమ ఇంటిలోకి కోడలిగా ఆహ్వానిస్తున్నట్లు స్పష్టం చేశారు. కొత్త కోడలితో అక్కినేని ఫ్యామిలీ ఫ్రేమ్ చూడముచ్చటగా ఉందని చెప్పవచ్చు.

నాగ చైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మీ కూడా ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. నాగార్జున దివంగత లెజెండ్రీ నిర్మాత రామానాయుడు కూతురు దగ్గుబాటి లక్ష్మిని వివాహం చేసుకున్నారు. నాగచైతన్య పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత ఆమె అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఇంకొక వివాహం చేసుకొని ఒక కొడుకు కి కూడా జన్మనిచ్చింది. ఇక నాగార్జున కూడా అమలను వివాహం చేసుకొని అఖిల్ కి జన్మనిచ్చిన విషయం తెలిసిందే