Movie News

ఫస్ట్ ఎఫైర్ గురించి తెలిపిన శిల్పా శెట్టి

చిత్రసీమలో నటి నటుల మధ్య ప్రేమ , వివాహం, విడాకులు ఇవన్నీ కామన్. షూటింగ్ సమయంలో దగ్గర అవ్వడం..పెళ్లి చేసుకోవడం , కొద్దీ రోజులకే విడిపోవడం చేస్తుంటారు. ఈ క్రమంలో హీరోయిన్ శిల్ప శెట్టి తన ఫస్ట్ ఫస్ట్ ఎఫైర్ గురించి తెలిపింది. టీనేజ్‌లో ఉన్నప్పుడే శిల్పా శెట్టి మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టింది. అంతేకాదు, తనదైన అందంతో ఆ రంగంలో టాప్ ప్లేస్‌కు చేరింది. దీంతో ఆమెకు సినిమా ఛాన్స్‌లు వచ్చాయి. ఇలా ‘బాజీగర్’ అనే చిత్రంతో ఈ అమ్మడు హీరోయిన్‌గా మారింది. ఇందులో అదిరిపోయే నటనతో ఆకట్టుకుని ఎన్నో అవార్డులు సైతం అందుకుంది. అలా దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. ‘సాహస వీరుడు సాగర కన్య’ అనే సినిమాతో తెలుగులోకి ఎంటరైంది. ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘వీడెవడండీ బాబు’, ‘ఆజాద్’, ‘భలేవాడివి బాసూ’ వంటి చిత్రాలు చేసింది. అయితే, వీటి తర్వాత శిల్పా టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చింది. కానీ, వేరే భాషల్లో బిజీ అయింది.

తాజాగా ఈ అమ్మడు ఓ నేషనల్ ఛానెల్‌తో మాట్లాడింది. ఈ సందర్భంగా శిల్పా శెట్టి ఎఫైర్ గురించి మాట్లాడుతూ.. ‘నేను 22 ఏళ్ల వయసు ఉన్నప్పుడే కన్యత్వం కోల్పోయాను’ అంటూ మరోసారి బయట పెట్టేసింది. కన్యత్వం కోల్పోయానని చెప్పిన శిల్పా శెట్టి.. తన బాయ్‌ఫ్రెండ్ వివరాలను మాత్రం రివీల్ చేయలేదు. కానీ, బాలీవుడ్ మీడియాలో మాత్రం అది స్టార్ హీరో అక్షయ్ కుమార్ పనే అని వార్తలు వస్తున్నాయి. శిల్పా శెట్టి మొదట అక్షయ్‌తోనే డేటింగ్ చేస్తూ.. ఆ సమయంలో వీళ్లు శారీరకంగా సంబంధం కలిగి ఉన్నారట. దీంతో శిల్ప..ఫస్ట్ అక్షయ్‌తోనే గడిపింది అంత కామెంట్స్ చేస్తున్నారు.