Friday, October 18, 2024
HomeMovie Newsమామ విజయం తో మొక్కులు చెల్లించుకున్న సాయి ధరమ్ తేజ్

మామ విజయం తో మొక్కులు చెల్లించుకున్న సాయి ధరమ్ తేజ్

- Advertisement -

ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించాలని చెప్పి అభిమానులే కాదు మెగా ఫ్యామిలీ సైతం దేవుళ్ళకు మొక్కులు మొక్కుకున్నారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ భారీ విజయం సాదించడమే కాదు ఉప ముఖ్యమంత్రి తో పాటు పలు శాఖలకు సైతం మంత్రి కావడం తో జనసేన శ్రేణులు, అభిమానులు , మెగా ఫ్యామిలీ ఫుల్ గా హ్యాపీగా ఉన్నారు. ఇదే క్రమంలో తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రముఖ నటుడు, మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్.. తిరుమలకు వచ్చారు. స్వామివారిని దర్శించుకున్నారు.

తన మొక్కులను చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్నారాయన. పద్మావతి అతిథి గృహంలో బస చేశారు. ఈ ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. మేనమామ పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో గెలవడం, ఉప ముఖ్యమంత్రి హోదాను పొందడంతో సాయి ధరమ్ తేజ్.. తిరుమలను సందర్శించారు. పవన్ గెలిస్తే కాలినడకన తిరుమలకు వస్తానంటూ మొక్కిన మొక్కులను చెల్లించుకున్నారు. ఆయనతో ఫొటోలు దిగడానికి అలిపిరి మెట్ల మార్గంలో భక్తులు పోటీ పడ్డారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read