Movie News

ప్రధానిని అకిరా కలవడం ఫై రేణు ఎమోషనల్ పోస్ట్

ప్రస్తుతం అకిరా నందన్ పేరు సోషల్ మీడియా లో మారుమోగుతోంది. ఏపీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించడం..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో పిఠాపురంలో గెలవడమే కాక జనసేన తరపున నిల్చున్న 21 మంది ఎమ్మెల్యేలు, రెండు ఎంపీలు గెలిచారు. దీంతో అభిమానులు, జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పదేళ్లుగా కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ ..ఇప్పుడు భారీ విజయం సాధించడం తో చిత్రసీమలోను ప్రతి ఒక్కరు అభినందనలు తెలియజేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో తండ్రి విజయంలో పాలుపంచుకుంటున్న అకిరా నందన్ సైతం ఇప్పుడు వైరల్ మారారు.

పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లిన..ఎవర్ని kalisina తన కుమారుడ్ని పరిచయం చేస్తూ వస్తున్నాడు. మొన్నటి మొన్న చంద్రబాబు కు పరిచయం చేయగా…ఢిల్లీ లో NDA సమావేశానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ ప్రధాని మోడీ కి తన భార్య , కుమారుడు ను మోడీకి పరిచయం చేసారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే అకిరా నందన్ పీఎం నరేంద్ర మోదీని కలవడంపై రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

రేణు దేశాయ్ బీజేపీ సపోర్టర్ అని తెలిసిందే. గతంలో పలు మార్లు బీజేపీకి మద్దతుగా, మోదీకి మద్దతుగా అనేక పోస్టులు పెట్టింది. తాజాగా అకిరా నందన్ మోదీని కలిసిన ఫోటోలు షేర్ చేస్తూ.. నేను ఎప్పట్నుంచో బీజేపీ వ్యక్తిని. ఇవాళ నా కొడుకు అకిరాని పీఎం నరేంద్రమోదీ గారి పక్కన చూడటం ఎంతో ఆనందంగా, ఎమోషనల్ గా ఉంది. దీనిపై నాకు చాలా రాయాలని ఉంది కానీ మాటలు రావట్లేదు, నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను. మోడీని కలిసాక అకిరా నాకు కాల్ చేశాడు. మోదీ గారు చాలా స్ట్రాంగ్ పర్సన్, అయన చుట్టూ ఒక పాజిటివ్ వైబ్ ఉందని చెప్పాడు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అలాగే అకిరా ట్యాలెంట్ ఒక్కోటి బయటపెడుతోంది రేణు. అకిరా నందన్ మ్యూజిక్ డైరెక్టర్ అని, కీ బోర్డు బాగా వాయిస్తాడనే ఇప్పటివరకు మనకు తెలుసు. కానీ రేణు దేశాయ్ నిన్న అకిరా నందన్ తన తండ్రి పై చేసిన పవర్ ఫుల్ ఎడిటింగ్ వీడియో షేర్ చేసి అకిరా మంచి ఎడిటర్ అని తెలిపింది. ఇది కూడా వైరల్ గా మరి అకిరా ను మరింత పాపులర్ చేస్తుంది.