Movie News

శృతి – శంతను దూరంకావడానికి రొమాన్సే కారణమా..?

గత పది రోజులుగా చిత్రసీమలో శృతిహాసన్ బ్రేకప్ వార్త తెగ హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కమల్ కూతురిగా ఇండస్ట్రీ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శృతి..కెరియర్ మొదట్లో కాస్త తడబడ్డ..ఆ తరువాత నిలదొక్కుంది. కెరియర్ స్పీడ్ అందుకుంటున్న సమయంలో ఫోటోగ్రాఫర్ తో ప్రేమాయణం మొదలుపెట్టి..సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత అతడితో విడిపోయాక మళ్లీ వరుస సినిమాలతో బిజీ అయ్యింది. ఇదే తరుణంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఆర్టిస్ట్, ఇల్లస్ట్రేటర్ శంతను హాజరికాతో సహజీవనం మొదలుపెట్టి సినిమాలఫై ఫోకస్ తగ్గింది. తరుచు ఇద్దరు చెట్టపట్టాలు వేసుకుంటూ..ముద్దుల్లో మునిగిపోతూ అబ్బో అనిపించారు. నిత్యం సోషల్ మీడియా లో వీరిద్దరి పిక్స్ షేర్ చేస్తూ అభిమానుల్లో , నెటిజన్లల్లో ఉత్సాహం నింపుతూ వచ్చారు. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు కావొచ్చు అనుకున్న టైం లో వీరిద్దరూ విడిపోయారనే వార్త అందర్నీ షాక్ లో పడేస్తుంది. ఎందుకు వీరిద్దరూ విడిపోయారని అనుకుంటున్నా సమయంలో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ విడిపోవడానికి ‘రొమాన్స్ ‘ కారణంనాటున్నారు.

శృతి హాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇద్దరు ఇటీవల ఇనిమెల్ అనే షార్ట్ వీడియోలో నటించారు. ప్రేమ కథగా రూపొందిన ఆ కథకు కమల్ హాసన్ కూడా భాగం పంచుకొన్నారు. ఆ షార్ట్ ఫిలింలో శృతి, లోకేష్ కనకరాజ్ మధ్య రొమాన్స్ పీక్స్ లెవెల్‌లో కనిపించింది. వారిద్దరి షార్ట్ ఫిలిం కారణంగానే శంతను, ఆమెకు బ్రేకప్ జరిగిందనేది తాజాగా వార్త. బ్రేకప్ తర్వాత శృతిహాసన్ సోషల్ మీడియాలో ఘాటైన మెసేజ్‌తో స్పందించారు. ఆయనతో బంధం క్రేజీ రైడ్. ఆ బంధం కారణంగానే నా గురించి, నాతో ఉన్న వారి గురించి చాలా విషయాలు నేర్చుకొన్నాను అని షాకింగ్‌గా పోస్టు పెట్టింది. లోకేష్ కనకరాజ్‌తో బంధం కారణంగానే రియలైజ్ అయిందా? అతడి సహచర్యంలోనే అన్నీ తెలుసుకొన్నాదా? నా చుట్టు ఉన్న ప్రజల గురించి ఏం తెలుసుకొన్నది? శంతనుతో విడిపోవడం వెనుక ఆ వ్యక్తే ఉన్నారా? అనే ప్రశ్నలు ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతున్నాయి.