Friday, October 18, 2024
HomeMovie Newsఅరకు అడవుల్లో రవితేజ కు ఏంపని..?

అరకు అడవుల్లో రవితేజ కు ఏంపని..?

- Advertisement -

మాస్ మహారాజ రవితేజ సినిమాలపై ఎంత ఇంట్రస్ట్ చూపిస్తాడో తెలియంది కాదు..హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తుంటాడు. ప్రస్తుతం డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు. హిందీ రైడ్ సినిమాను తెలుగులో మిస్టర్ బచ్చన్‌గా హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే తన 75 చిత్రానికి శ్రీకారం చుట్టారు. ‘సామజవరగమన’ సినిమా రచయిత భాను బోగవరపు దర్శకుడిగా పరిచయం చేస్తూ….కామెడీ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే రవితేజకు పీరియాడిక్ సినిమాలు చేయడం ఇదేమి కొత్త కాదు. మళ్లీ మరో సినిమా కూడా చేయబోతున్నాడు. కొత్త దర్శకుడుతో సితార సంస్థ నిర్మించే రవితేజ సినిమా పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా అరకు అటవీ ప్రాంతంలో జరిగే కథగా తెరకెక్కిస్తున్నట్ల సమాచారం. ఇక కొత్త దర్శకుడు భాను భోగవరపు ఎలాగైనా రవితేజతోనే ఈ కథ చేయాలని పట్టుబట్టుకొని కూర్చున్నాడట. ఇక రవితేజ కూడా ఇందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read