Movie News

‘రోమ్‌లో ఉన్నవాళ్లు రోమన్స్‌లా బతకాలి’ రష్మిక కామెంట్ కు ఫ్యాన్ షాక్

గీత గోవిందం తో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న రష్మిక..ఆ తర్వాత వరుస చిత్రాలతో అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది. ఇక పుష్ప మూవీ తో పాన్ ఇండియా స్టార్ అయ్యింది. పుష్ప దెబ్బ కు బాలీవుడ్ లో ఛాన్సులు దక్కించుకుంది. ఇక రణబీర్ తో చేసిన యానిమల్ మూవీ అమ్మడి జతకమే మార్చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా చేసిన ఫోటో షూట్ మరో లెవల్లో ఉంది. ఈ ఫొటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసి ‘మీకే అధిక ప్రాధాన్యత.. ఇచ్చుకోండి..’ అంటూ క్యాప్షన్‌ జతచేసింది. ఇక అభిమానులు కామెంట్లతో చెలరేగిపోతున్నారు.

బాలీవుడ్‌ కెళ్లగానే ఈ మేకోవర్‌ ఏంటి? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘రోమ్‌లో ఉన్నవాళ్లు రోమన్స్‌లా బతకాలి.. అనేది పెద్దలమాట. నేను అది కచ్చితంగా ఆచరిస్తా. బాలీవుడ్‌లో ఎలా ఉండాలో అలా ఉంటేనే అవకాశాలు. అయితే నటిగా నాకంటూ కొన్ని పరిథులున్నాయి. వాటిని మాత్రం అతిక్రమించను. ఏ భాషలో నటిస్తే, ఆ భాష అమ్మాయిగా మారిపోవడం నాకిష్టం’ అని చెప్పకొచ్చింది నేషనల్‌ క్రష్‌ .