Movie News

కొత్త దర్శకుడితో రానా మూవీ..?

‘విరాట పర్వం’ వచ్చి రెండేళ్లవుతున్నా దగ్గుబాటి రానా మళ్లీ పూర్తి స్థాయి సినిమా చేయలేదు. ఇటీవలే ఆయన కొత్త దర్శకుడు కిశోర్ చెప్పిన కథకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మాణంలో అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని టాక్. రానా బాహుబాలి వంటి సినిమాల్లో కీల‌క‌మైన పాత్ర‌లు పోషించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత చాలా చిత్రాల్లో అంటే ఈ రెండేళ్ల‌లో రానా ఎక్కువ‌గా అతిథి పాత్ర‌ల్లోనే క‌నిపించారు.

ఓ పక్క విలక్షణ పాత్రలు చేస్తూనే కథా బలమున్న చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయన నిర్మాణంలో రెండు చిత్రాలను ప్రకటించారు. అయితే నటుడిగా ఆయన నుంచి సినిమా రాకపోయేసరికి అభిమానులు కాస్త నిరాశ లో ఉన్నారు. ఈ క్రమంలో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అభిమానులను సంతోష పరిచారు. మరి ఈ సినిమా కథ ఏంటి..మిగతా విశేషాలు ఏంటి అనేవి తెలియాల్సి ఉంది.