Movie News

మారుతీ ఫై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం

ప్రభాస్ నటించిన . ‘కల్కి 2898 ఏడీ’ మూవీ భారీ విజయం సాధించడం తో ప్రభాస్ నుండి వస్తున్న నెక్స్ట్ మూవీ రాజాసాబ్’ పై అందర్నీ రెట్టింపు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా డైరెక్టర్ మారుతీ జాగ్రత్త పడుతున్నాడు. ప్ర‌భాస్ ని జోవియ‌ల్ గా చూసి కూడా చాలా కాల‌మైంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభాస్ చేస్తున్న తొలి హార‌ర్ సినిమా ఇది.

ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఈ సినిమా గురించి ఎదురు చూడ‌డానికి ఇలా స‌వాల‌క్ష కార‌ణాలు, కోణాలూ ఉన్నాయి. ఈ సినిమాని మ‌రింత స్పెష‌ల్ గా మార్చ‌డానికి మారుతి త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఈ సినిమా తాలూకా గ్లింప్స్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. గ్లింప్స్ లో ప్రభాస్ స్టైలిష్ గా బండి మీద వచ్చి పూలతో తనకి తాను దిష్టి తీసుకున్నాడు. అయితే ఈ సినిమా మొన్నటి వరకు సంక్రాంతికి వస్తుందని చెపుతూ వచ్చిన మేకర్స్..ఇప్పుడు సమ్మర్ కు రాబోతున్నట్లు తెలియజేయడం తో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి అయ్యింది. అయినప్పటికీ సమ్మర్ కు పోస్ట్ ఫోన్ చేయడం ఏంటి అని మండిపడుతున్నారు.