News

పవన్ ఏ పని చేసిన ట్రెండ్ సెట్ చేస్తుందంతే..

సినీ నటుడు , జనసేన అధినేత , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏంచేసినా వైరల్ కావాల్సిందే..ట్రెండ్ సెట్ చేయాల్సిందే. ప్రస్తుతం అదే జరుగుతుంది. తాజాగా వారాహీ నవరాత్రులు మొదలవ్వడంతో మరోసారి అమ్మవారి దీక్ష స్వీకరించారు పవన్ కళ్యాణ్ . ఈ సమయంలో పాలు, పండ్లు, ద్రవాహారం తీసుకున్నారు. దీక్షకు అనుగుణంగా సాంప్రదాయ వస్త్రాలను ధరించి రోజువారి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఎన్నడూ లేని విధంగా తెలుగు నాట వారాహి అమ్మవారి నవరాత్రులను భక్తిశ్రద్ధలతో ఆచరిస్తున్నారు భక్తులు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై తొలిసారిగా వారాహి నవరాత్రులను నిర్వహిస్తున్నారు.

ప్రజల్లో వారాహి అమ్మవారిపై గురి కుదరడానికి ఒక రకంగా పవన్ కళ్యాణ్ కారణమని ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. మిడిల్ క్రాఫ్, మార్షల్ ఆర్ట్స్, వన్ సైడ్ కాలేజ్ బ్యాగులు, అవెంజర్ బైకులు, చివరికి చెగువేరా ఇలా పవన్ ఏది చేస్తే అది అభిమానులు ఫాలో అయ్యారు. ఇప్పుడు వారాహి అమ్మవారి కారణంగానే పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయాన్ని సాధించడంతో జనం కూడా ఆమె దీక్ష తీసుకోవాలని నిర్ణయించుకుని ఉండొచ్చని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఏదైతే ఏం ఈ రకంగానైనా సనాతన సాంప్రదాయం, మన సంస్కృతి, దైవోపాసనపై నేటి తరం ఆసక్తి చూపిస్తూ ఉండటంతో సాంప్రదాయ వాదులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.