Movie News

టాలీవుడ్ ఎవరి ఫ్యామిలీ సొత్తు కాదు – నాగబాబు

నాగబాబు కూతురు నిహారిక కొణిదెల నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం కమిటీ కుర్రోళ్ళు. ఈ సినిమా ఆగస్టు 9 వ తేదీన రిలీజ్ కానుంది. ఒక విలేజ్ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కమిటీ కుర్రోళ్ళు సినిమాకు యాదు వంశీ దర్శకత్వం వహించాడు. ఇక సినిమాకి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ ప్రోమోలు మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, తాజాగా కమిటీ కుర్రోళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, అలాగే అడివి శేష్ లు గెస్ట్ లుగా హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో నాగబాబు కీలక వ్యాఖ్యలు చేసారు.

జనరల్ గా మెగా ఫ్యామిలీ మీద కొన్ని నెగిటివ్ కామెంట్స్ వింటూ ఉంటాం.. వీళ్ళు తప్ప ఇంకెవరూ ఉండరు,.. అలాగే కొంతమంది ఫ్యామిలీస్ మీద కూడా ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడే వారిని చాలా మందిని చూశాం.. మాకు అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ లేదు.. “ఈ సినిమా ఇండస్ట్రీ మెగా ఫ్యామిలీది కాదు.. మా అబ్బ సొత్తు ఏమి కాదు. మా నాన్న సామ్రాజ్యం కాదు. మా తాత సామ్రాజ్యం కాదు.. ఇక అలాగే అక్కినేని ఫ్యామిలీనో, నందమూరి ఫ్యామిలీనో కాదు… ఈ ఇండస్ట్రీ అందరిదీ. టాలెంట్ ఉన్నోళ్లు అందరూ రాణిస్తారు. రీసెంట్ గా అడివి శేష్ లాంటి ఎంతోమంది హీరోలు సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా రాణిస్తున్నారు. వాళ్ళ సొంత టాలెంట్ తో పైకి వచ్చారు అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.