Movie News

విజయ్ చిత్ర రైట్స్ ను దక్కించుకున్న మైత్రీ మూవీస్

మైత్రీ మూవీస్..ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్. అగ్ర హీరోలందరి తో వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తూ టాప్ బ్యానర్ గా గుర్తింపు తెచ్చుకుంది. మైత్రీ మూవీస్ అంటే చాలు ఏ హీరో నైనా టక్కున డేట్స్ ఇస్తున్నారు. అలాంటి కథలు , డైరెక్టర్స్ ను పట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యానర్ విజయ్ మూవీ తెలుగు రైట్స్ ను దక్కించుకున్నారు.

హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కల్పతి ఎస్. అఘోరం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ తెలుగు హక్కులను టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

‘ది గోట్’ మూవీ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దాదాపు రూ. 30 కోట్లకు తెలుగు హక్కులు కొనుగోలు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకముందు విజయ్ నటించిన ‘లియో’ తెలుగు రైట్స్ 21 కోట్లకు అమ్ముడైతే.. ‘బీస్ట్’ మూవీ హక్కులు 10 కోట్ల వరకూ పలికాయి. ‘మాస్టర్’ సినిమాని దగ్గర దగ్గర 8 కోట్లు చెల్లించి తీసుకున్నారు.

వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 5న విజయ్ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మైత్రీ సంస్థ తెలుగులో రిలీజ్ చేస్తుందని ప్రకటించారు. అయితే ఇంతలోనే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ‘లక్కీ భాస్కర్’ సినిమాని సెప్టెంబర్ 7వ తేదీన పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. దీన్ని బట్టి బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాల మధ్య గట్టి పోటీ ఏర్పడేలా కనిపిస్తోంది.