Friday, October 18, 2024
HomeMovie News'విశ్వంభర' సెట్లో సందడి చేసిన ఏపీ మంత్రి

‘విశ్వంభర’ సెట్లో సందడి చేసిన ఏపీ మంత్రి

- Advertisement -

ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ మెగాస్టార్ చిరంజీవిని ‘విశ్వంభర’ సెట్లో మర్యాద పూర్వకంగా కలిశారు. మెగాస్టార్ చిరంజీవి , త్రిష జంటగా బింబిసార ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘విశ్వంభర’. హై వీఎఫ్​ఎక్స్, సోసియో ఫ్యాంటసీ జానర్​గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతూ వస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్​లో కొత్త షెడ్యూల్ నడుస్తుంది. ఈ షెడ్యూల్​లో హై వోల్టేజ్ ఇంటర్వెల్ బ్లాక్ సన్నివేశాలు షూట్ చేసినట్లు సమాచారం. కాగా ఈ మూవీ సెట్ కు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ వచ్చి మర్యాద పూర్వకంగా చిరంజీవి ని కలిశారు.

దీనిపై చిరు స్పందిస్తూ.. మిత్రుడు శ్రీ కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా ‘విశ్వంభర’ సెట్స్‌పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని నా శుభాకాంక్షలు..

తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి , ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని చెప్పారు. ఆయన సానుకూలతకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. అలాగే పర్యాటకరంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి వున్న ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను! ..అని చిరంజీవి ట్వీట్ చేసారు.

మిత్రుడు శ్రీ కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా ‘విశ్వంభర’ సెట్స్‌పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని నా శుభాకాంక్షలు!💐💐… pic.twitter.com/R7tDsrPR6R— Chiranjeevi Konidela (@KChiruTweets) June 20, 2024

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read