Movie News

‘మనమే’ ట్రైలర్ రిలీజ్

శర్వానంద్ (Sharwanand), కృతిశెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న మూవీ మ‌న‌మే(Maname). ఈ మూవీ నుంచి ఇప్ప‌టికే టైటిల్ గ్లింప్స్‌తో పాటు టీజ‌ర్ రిలీజ్ చేయ‌గా.. ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఇప్పుడు ట్రైలర్ విడుదల చేసి సినిమా ఫై అంచనాలు పెంచారు మేకర్స్.

శర్వానంద్, కృతి శెట్టి క‌లిసి ఒక బాబుని పెంచుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. అయితే ఆ బాబు ఎవరు అనేది తెలియ‌కుండా ఉంది. ఇక ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న ఈ సినిమా ట్రైల‌ర్ ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. పాపులర్ బ్యానర్‌ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తుండ‌గా.. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఈ మూవీ లో ఏకంగా 16 సాంగ్స్ ఉన్నట్లు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెలిపారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. ‘మనమే మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి పూర్తయ్యే వరకూ మ్యూజిక్తో నిండిపోతుంది. ఈ సినిమాలో 16 సాంగ్స్ ఉంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి ఆత్మ. కెరీర్లోనే బెస్ట్ ఇచ్చారు’ అని తెలిపారు. మరి ఆ 16 తోనే సినిమా అంత సాగుతుందా అనేది చూడాలి.