Friday, October 18, 2024
HomeMovie Newsచావుబతుకుల్లో వీరాభిమాని..మహేష్ ఏంచేసాడో తెలుసా..?

చావుబతుకుల్లో వీరాభిమాని..మహేష్ ఏంచేసాడో తెలుసా..?

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. వీరిలో మహిళలు , యువతే కాదు , పెద్దవారు , ముసలివారు కూడా ఉన్నారు. అలాంటి అభిమానుల కోసం నిత్యం ఏదోకటి చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. మహేష్ బాబు సినిమాల్లో మాత్రమే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోనే. తన మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఇప్పటికే 1000కి మందికి పైగా చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు ఉచితంగా చేయించి ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచాడు.

తాజగా మహేష్ బాబు తన వీరాభిమానికి పెద్ద సహాయం చేసాడు. మోపిదేవి పెదప్రోలులో కాకర్లమూడి రాజేష్ అనే వ్యక్తి కృష్ణకు, మహేష్ బాబుకి వీరాభిమాని. అతనికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. రాజేష్ కి మహేష్ బాబు అంటే ఎంత పిచ్చి అంటే తన ముగ్గురు కొడుకులకు కూడా మహేష్ బాబు సినిమాల పేర్లు పెట్టాడు. తన కొడుకులు పుట్టినప్పుడు మహేష్ బాబు రిలీజయిన సినిమాలు ఏవి ఉంటే వాటి పేర్లు పెట్టాడు. రాజేష్ మొదటి కొడుకు పేరు అర్జున్, రెండో కొడుకు పేరు అతిధి, మూడో కొడుకు పేరు ఆగడు అని పెట్టడం గమనార్హం.

అయితే మహేష్ వీరాభిమాని రాజేష్ ప్రస్తుతం కిడ్నీ ఫెయిల్ అయి చావు బతుకుల మధ్య ఉన్నాడు. పేద కుటుంబం కావడంతో పిల్లలు చదువు మానేసి పనులు చేయాల్సిన స్థితి ఏర్పడింది. పెద్ద కొడుకు చెప్పుల షాప్ లో పని చేస్తున్నాడు. అయితే ఈ విషయం ఆ పిల్లలు చదివే స్కూల్ ప్రిన్సిపాల్ కి తెలియడంతో మహేష్ అభిమానులకు ఈ విషయాన్ని తెలియచేసారు. ఈ విషయం మహేష్ బాబు వద్దకు చేరడంతో మహేష్ బాబు ఫౌండేషన్ టీమ్ పెదప్రోలుకు వచ్చి రాజేష్ పిల్లలు అతిధి, ఆగడులను మోపిదేవిలోని ఓ స్కూల్ లో జాయిన్ చేయించి డబ్బులు కట్టారు. ప్రతి సంవత్సరం మహేష్ నుంచే డబ్బులు వస్తాయని, వాళ్ళని చదివిస్తామని చెప్పినట్టు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ విషయం తెలిసి యావత్ మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు .

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read