Friday, October 18, 2024
HomeMovie Newsకమిటీ కుర్రోళ్లు ఈవెంట్ లోను 'జగన్' ను వదలని హైపర్ ఆది

కమిటీ కుర్రోళ్లు ఈవెంట్ లోను ‘జగన్’ ను వదలని హైపర్ ఆది

- Advertisement -

ఏపీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోరాతిఘోరమైన పరాజయాన్ని మూటకట్టుకున్న సంగతి తెలిసిందే. 175 కు 175 సాధిస్తామని ధీమా వ్యక్తం చేయగా..ప్రజలు మాత్రం కేవలం 11 సీట్లకే పరిమితం చేసాడు. ఈ 11 సీట్ల ఫై విపరీతమైన ట్రోల్స్ నడుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా జనసేన కార్యకర్త, పవన్ కళ్యాణ్ వీరాభిమాని హైపర్ ఆది ఏమాత్రం గ్యాప్ దొరికిన 11 సీట్ల ఫై తనదైన స్టయిల్ లో సెటైర్లు వేస్తున్నారు.

నాగబాబు కూతురు నిహారిక కొణిదెల నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం కమిటీ కుర్రోళ్ళు. ఈ సినిమా ఆగస్టు 9 వ తేదీన రిలీజ్ కానుంది. ఒక విలేజ్ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కమిటీ కుర్రోళ్ళు సినిమాకు యాదు వంశీ దర్శకత్వం వహించాడు. ఇక సినిమాకి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ ప్రోమోలు మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, తాజాగా కమిటీ కుర్రోళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, అలాగే అడివి శేష్ లు గెస్ట్ లుగా హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో హైపర్ ఆది తన స్పీచ్ తో ఆకట్టుకున్నాడు.

“నిహారిక వాళ్ల బాబాయ్‌లానే ట్రెండ్ ఫాలో అయ్యే టైప్ కాదు ట్రెండ్ సెట్ చేసే టైప్. 11 మంది హీరోలను పెట్టి ఒక సినిమా చేసిందంటే ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేసినట్లే. 11 మంది హీరోలంటే ఇప్పుడు రీసెంట్‌గా ఇండియాకి 11 మంది క్రికెటర్లు వరల్డ్ కప్ తెచ్చినట్లు.. ఈ 11 మంది హీరోలు నిహారిక గారికి గొప్ప విజయాన్ని తేవాలని కోరుకుంటున్నాను. మనకి 11 అంటే చాలా గుర్తొస్తాయి.. కానీ ఈ సినిమా రిలీజైన తర్వాత ఖచ్చితంగా ఈ 11 మందే గుర్తొస్తారు.” అంటూ హైపర్ ఆది అన్నాడు.

ఈ సినిమాకి 11 మంది హీరోలు..
మొన్న Worldcup 11 మంది తెచ్చారు

11 అంటే ఇంకా చాలా చాలా గుర్తొస్తాయి – #HyperAadi 😂😂#CommitteeKurrollu pic.twitter.com/zwj8cCeTcI— Narendra G (@Narendra4News) August 5, 2024

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read