Movie News

క్రిస్మస్ కు గేమ్ ఛేంజర్..?

శంకర్ – రామ్ చరణ్ కాంబోలో రాబోయే గేమ్ ఛేంజర్ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉండగా..భారతీయుడు 2 కారణంగా గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ప్రస్తుతం భారతీయుడు 2 రిలీజ్ అవ్వడం తో ఇక గేమ్ ఛేంజర్ షూటింగ్ ను త్వరగా పూర్తి చేయాలనీ చూస్తున్నారు. మరి ఈ చిత్రాన్ని ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో అనేది సస్పెన్స్ గా ఉండడం తో తాజాగా నిర్మాత దిల్ రాజు సినిమా రిలీజ్ ఫై ఓ క్లారిటీ ఇచ్చారు.

తాజాగా ధనుష్ నటించిన రాయన్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన దిల్ రాజు రాయన్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. పనిలో పని గా గేమ్ ఛేంజర్ అని ఫ్యాన్స్ అడగగా, క్రిస్మస్ కి కలుద్దాం అంటూ… గేమ్ చేంజర్ ని క్రిస్మస్ కి తీసుకువస్తున్నట్టు చెప్పకనే చెప్పాడు. గేమ్ ఛేంజర్ ని ముందుగా దీపావళి కి రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఆ సమయంలో పలు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కానుండగా, దిల్ రాజు సోలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. అందుకే క్రిస్మస్ కి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.