Movie News

ఓయో రూమ్ లో సూసైడ్ చేసుకున్న తెలుగు డైరెక్టర్..

ఇటీవల చిత్రసీమకు చెందిన చాలామంది అనేక కారణాలతో చనిపోతున్నారు. కొంతమంది అనారోగ్య సమస్యలతో , మరికొంతమంది రోడ్డు ప్రమాదాలతో , ఇంకొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటూ తనువూ చాలిస్తున్నారు. తాజాగా సినీ డైరెక్టర్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. దర్శకుడు కొమరి జానయ్య కూకట్‌పల్లి లోని భాగ్య నగర్ కాలనీలో ఆనంద్ ఇన్ ఓయో లాడ్జిలో ఫ్యాన్ కు ఉరేసుకొని మరణించారు. ఈ వార్త ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన డైరెక్టర్ చనిపోవడం పై పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక సినిమా డైరెక్టర్ అకస్మాత్తుగా సూసైడ్ చేసుకోవడమేంటి? ఏవైనా ఆర్ధిక కారణాల? లేక కుటుంబ సమస్యలా? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఒక డైరెక్టర్ ఇలా హోటల్లో చనిపోవడం పట్ల సినిమా ఇండస్ట్రీలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి.