Movie News

రాజ్ తరుణ్ ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన దిలీప్ సుంకర

దిలీప్ సుంకర అంటే అందరికి సుపరిచితమే..జనసేన పార్టీ , పవన్ కళ్యాణ్ తరుపున తన గళం తో అందరికి దగ్గరయ్యారు. లాయర్ వృత్తి చేస్తున్న ఈయన..తాజాగా రాజ్ తరుణ్ ఫై కేసు పెట్టిన లావణ్య తరుపున వాదిస్తున్నాడు. ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో రాజ్ తరుణ్ – లావణ్య వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.ఈ కేసురోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తి పెంచుతుంది.

ఈ కేసుకు సంబదించిన కీలక విషయాలను లాయర్ మీడియా కు వెల్లడించారు. లావణ్య కి ఆమె లవర్ రాజ్ తరుణ్ తీవ్ర అన్యాయం చేసాడని అతను నేరం చేసాడనడానికి దాదాపు 700కి పైగా ఆధారాలను పోలీసులకి అందచేసినట్టుగా లాయర్ దిలీప్ చెప్పారు. ఇక లావణ్యతో పదేళ్లు ప్రేమాయణం నడిపిన రాజ్ తరుణ్ లావణ్య ని మానసికంగా హింసించాడని చెప్పుకొచ్చాడు. అలాగే ఓ సందర్భంలో లావణ్యపై రాజ్ తరుణ్ బీర్ బాటిల్‌తో దాడి కూడా చేశాడన్నాడు. రాజ్ తరుణ్ మొన్నామధ్య లావణ్యతో పెళ్లి కాలేదని చెప్తున్నా మాట అబద్ధమని, పదేళ్లు లావణ్యని అతను వాడుకుని రెండు సార్లు ప్రెగ్నెంట్ చేసి దగ్గరుండి అబార్షన్ కూడా చేయించాడని లాయర్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

నార్సింగి పోలీస్ స్టేషన్‌లో లావణ్య ఇచ్చిన ఫిర్యాదులో మాల్వీ మల్హోత్రా అనే హీరోయిన్ తనని చంపేస్తానని బెదిరిస్తుందని తనకి ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరింది. దీంతో ఆ హీరోయిన్ నుండి ఇన్ఫర్మేషన్ లాగితే రాజ్ తరుణ్ గురించి అన్ని విషయాలు తెలిసాయి అంటూ అంటూ దిలీప్ సుంకర చెప్పుకొచ్చారు.