News

చిరంజీవి మాజీ అల్లుడు మృతి

మెగాస్టార్‌ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్‌ భరద్వాజ్‌ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమసల్యతో బాధపడుతున్నారు. లంగ్స్‌ డ్యామేజ్ తో హైదారాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించినట్లు తెలుస్తుంది.

శిరీష్ భరద్వాజ్, మెగా స్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజని 2007 సంవత్సరంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత కొన్ని సంవత్సరాల తరువాత వీరిద్దరి మధ్య పొరపొచ్చలు రావటం 2014లో విడిపోవటం జరిగింది. వీరిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది. తరువాత శిరీష్ భరద్వాజ్ ఇంకొక వివాహం చేసుకున్న సంగతి కూడా తెలిసిందే. శ్రీజ కూడా 2016 లో కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఓ బిడ్డ కూడా పుట్టింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడం తో విడిపోయారు. ప్రస్తుతం శ్రీజ..తల్లిదండ్రుల వద్ద ఉంది.