Movie News

ఇద్దరు ఎంపీలు ఒకే సినిమాలో హీరో-హీరోయిన్

చిత్రసీమ కు రాజకీయరంగానికి దగ్గర సంబధం ఉంది. చిత్రసీమలో రాణించిన వారు రాజకీయాల్లో అడుగుపెట్టి రాణించిన వారు ఉన్నారు. సీఎంలు , పలు మంత్రులు అయ్యి..ప్రజలకు సేవ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పటికి పలువురు ఎమ్మెల్యేలు గా కొనసాగుతున్నారు. తాజాగా దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సినీ ప్రముఖులు పలు చోట్ల విజయం సాధించారు. అయితే NDA కూటమిలో ఇద్దరు ఎంపీలు ఒకప్పుడు ఓ సినిమాలో హీరో-హీరోయిన్ గా చేయడం విశేషం. ఒకరు తొలిసారి MPగా పోటీ చేసి గెలిచిన కంగనా రనౌత్. మరొకరు లోక్ జనశక్తి చీఫ్ చిరాగ్ పాస్వాన్.

వీరిద్దరూ 2011లో వచ్చిన ‘మిలే నా మిలే హమ్’లో జంటగా నటించారు. అయితే అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు ఎంపీలుగా విజయం సాధించి లోక్ సభ లో అడుగుపెడుతుండడం విశేషం. ఇక హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కంగనా రనౌత్.. హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్ర సింగ్ కుమారుడు.. కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్‌ను ఓడించి విజయం సాధించారు. అయితే తాజాగా వెలువరించిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో గెలిచిన 2 రోజులకే ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురు కావడం గమనార్హం. నిన్న త‌న నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌యోత్స‌వ సంబురాల్లో పాల్గొని తిరిగి వ‌స్తున్న క్ర‌మంలో చండీగఢ్ విమానాశ్రయంలో కంగ‌నాపై అక్క‌డే డ్యూటీలో ఉన్న సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చేయి చేసుకుంది. ఇప్పుడీ అంశం స‌ర్వ‌త్రా తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.