Movie News

సుకుమార్ తో గొడవ ఫై బన్నీ క్లారిటీ

రెండు రోజులుగా సోషల్ మీడియా లో సుకుమార్ – బన్నీ మధ్య విభేదాలు అనే వార్తలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వివాదాల కారణంగా పుష్ప 2 షూటింగ్ కు బ్రేక్ పడిందని..ఇద్దరు ఎవరు దారిన వారు విదేశాలకు వెళ్లారని అంత మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ ప్రచారానికి బన్నీ టీం క్లారిటీ ఇచ్చారు.

అల్లు అర్జున్ తన జీవితంలో ఐదు సంవత్సరాలను పుష్ప మూవీ కోసమే అంకితం చేశాడు. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పుష్ప 2 కోసం రెండు సంవత్సరాలకు పైగా సమయాన్ని కేటాయించారు. అయితే ఈ మూవీ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. నిజానికి పెద్దగా వీఎఫ్ఎక్స్ తో పని లేని కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ మూవీ. అయినప్పటికీ రిలీజ్ విషయంలో ఇంకా ఆలస్యం జరుగుతూనే ఉంది. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ అయి ఉండాల్సింది.

కానీ వివిధ కారణాల వల్ల ఇంకా సెట్స్ పైనే ఉండడంతో పాటు ఇటీవల జరిగిన పలు సంఘటనల వల్ల అల్లు అర్జున్, సుకుమార్ మధ్య గొడవ జరిగిందంటూ కోలీవుడ్ చెందిన సోషల్ మీడియా పేజీలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ విషయంపై బన్నీ టీం క్లారిటీ ఇచ్చింది. సుకుమార్ యూఎస్ కు, బన్నీ యూరప్ కు ట్రిప్ వెళ్లారు. అక్కడ ఇద్దరికీ ఉన్న వేరే పనుల వల్ల పుష్ప 2 మూవీ షూటింగ్ ఆగిపోయింది. బన్నీ సుకుమార్ క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సమస్య లేదు. డిసెంబర్ 6న ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేస్తాము అంటూ ప్రకటించారు.

బన్నీ టీం నుంచి ఇలా అఫీషియల్ గా వివరణ వచ్చినప్పటికీ అది నమ్మశక్యంగా అనిపించడం లేదు. వీలైనంత తొందరగా సినిమాను పూర్తి చేయాలి. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరగాల్సి ఉంది. ఇలాంటి టైమ్ లో ఇలా పుష్ప 2 షూటింగ్ ను పక్కన పెట్టి మరీ వెకేషన్లను ఎంజాయ్ చేసేంత టైమ్ నిజంగానే వాళ్ళకు ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. మరి సినిమాను అనుకున్న టైం కు పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో లేదో చూడాలి.