Saturday, May 10, 2025
HomeMovie News"భైరవం" విడుదల తేదీని ప్రకటించారు

“భైరవం” విడుదల తేదీని ప్రకటించారు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ “భైరవం” ప్రతి అప్‌డేట్‌తో బజ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే పవర్ ల్ పోస్టర్లు, యాక్షన్‌ తో నిండిన టీజర్, రెండు సూపర్ హిట్ సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి పాట రొమాంటిక్ మెలోడీగా కాగా, రెండో సింగిల్ పవర్ ఫుల్ డివోషనల్ సాంగ్ గా అలరించింది. దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతిలాల్ గడా చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

- Advertisement -

తాజాగా మేకర్స్ సినిమాకు విడుదల తేదీని ప్రకటించారు. ఈ వేసవి సీజన్‌లో బిగ్గెస్ట్ అట్రాక్షన్‌గా మే 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో “భైరవం” విడుదల కాబోతోంది. 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురూ కలర్ఫుల్ ఫెస్టివల్ వైబ్ తో కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది. 

ఈ చిత్రంలో ఆదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై కథానాయికలుగా నటిస్తున్నారు. హరి కె వేదాంతం సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, చోటా కే ప్రసాద్ ఎడిటర్. బ్రహ్మా కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. డైలాగ్స్ సత్యర్షి, తూమ్ వెంకట్ రాశారు.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read