Saturday, July 27, 2024
HomeMovie Newsమెగా - అల్లు ఫ్యామిలీలో చిచ్చు పెట్టిన ఏపీ ఎన్నికలు

మెగా – అల్లు ఫ్యామిలీలో చిచ్చు పెట్టిన ఏపీ ఎన్నికలు

- Advertisement -

ఏపీ ఎన్నికలు సోమవారం ముగిసాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓటర్లు ఓటు వేసేందుకు పోటెత్తారు. ఇదే క్రమంలో ఈ ఎన్నికలు మెగా – అల్లు ఫ్యామిలీ లో చిచ్చుపెట్టాయి. ఈసారి ఎలాగైనా జగన్ ఓడించి విజయం సాధించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా కష్టపడినా సంగతి తెలిసిందే. పవన్ కోరిక తీరాలని చిత్ర సీమా నుండి పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు సపోర్ట్ చేసారు. అయితే స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్ధికి సపోర్ట్ చేయడం..ఇప్పుడు మెగా – అల్లు ఫ్యామిలీ లో చిచ్చుపెట్టింది.

వైసీపీ తరఫున పోటీలో ఉన్న శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ ఆయనకు మద్దతు ఇస్తూ మాట్లాడారు. అంతే.. అల్లు అర్జున్ ఫై మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం మొదలుపెట్టారు. మెగా ఫ్యామిలీ లో టాప్ హీరో.. వైసీపీకి మద్దతుగా మాట్లాడటం ఏమిటంటూ అందరూ అల్లు అర్జున్ పై ఫైర్ అయ్యారు. అయితే, వాటన్నిటినీ అల్లు అర్జున్ పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించలేదు.

ఇక పోలింగ్ ముగిసిన వెంటనే.. రాత్రి 10 గంటల సమయంలో మెగా బ్రదర్ నాగబాబు ఒక చిన్న పోస్ట్ Xలో చేశారు. “మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే…!” అంటూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. మెగా అభిమానులే కాకుండా అందరూ చర్చించుకునేలా ఈ ట్వీట్ ట్రెండ్ అవుతోంది. ఈ ట్వీట్ పరోక్షంగా అల్లు అర్జున్ పై విమర్శలు అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు అంటూ చేసిన విమర్శ కచ్చితంగా బన్నీని ఉద్దేశించి చేసిందే అని మెగా అభిమానులు అంటుకుంటున్నారు. దీనిని బట్టి మెగా – అల్లు ఫ్యామిలీ లో త్వరలో విభేదాలు మొదలు కాబోతున్నాయని అంత భావిస్తున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read