Movie News

విజయ్ దేవరకొండ ను వదలని అనసూయ..

మాములుగా వయసు పెరిగే కొద్దీ మహిళలో గ్లామర్ తగ్గిపోతుంటుంది..ఇక తల్లి పోస్ట్ కొట్టేసిన తర్వాత మరి..అయితే బుల్లితెర బ్యూటీ అనసూయ గ్లామర్ మాత్రం వయసు పెరిగే కొద్దీ గ్లామర్ పెరగడమే కాదు..హాట్ షో కూడా పెంచేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. అనసూయ..ఈ పేరు చెపితే చాలు కుర్రకారు హృదయాల్లో వేడి సెగలు పుట్టుకొస్తాయి. యాంకర్‌గా జర్నీ మొదలుపెట్టి.. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టిందంటే క్రేజ్‌ ఎలా మామూలుగా ఉండదు. తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది.

ప్రస్తుతం అటు వెండితెర ,ఇటు బుల్లితెర రెండు స్క్రీన్ లపై షూటింగ్ లు చేస్తూ బిజీ బిజీ గా ఉంది. టీవీ రంగంలో చాలా కాలం పాటు సత్తా చాటిన అనసూయ.. ఈ మధ్య కాలంలో మాత్రం దక్షిణాదిలోని చాలా భాషల్లో సినిమాలు చేస్తూ వెళ్తోంది. ఈ క్రమంలోనే గత ఏడాది ‘మైఖేల్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం అనసూయ నటించిన చిత్రం సింబా. ఆగస్టు 9న విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.ఈ ట్రైలర్లో జగపతిబాబు, అనసూయ, వశిష్టా సింహ, కస్తూరి శంకర్, కబీర్ సింగ్, గౌతమీ, అనీష్ కురువిల్లా ఇలా చాలామంది ఇందులో నటిస్తున్నారు ఈ సినిమాలో అనసూయ ఒక సైన్స్ టీచర్ పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు.. ట్రైలర్ చూస్తుంటే.. “మందు, దమ్ము కన్నా దుమ్ము వల్లే చాలామంది చనిపోతున్నారు” అంటూ జగపతి బాబు చెప్పడంతో ఈ సినిమా నేపథ్యం పొల్యూషన్ పై ఉండొచ్చని అర్థం అవుతోంది. ఇకపోతే ఈ సినిమాలో విజయ్ దేవరకొండను బాగానే వాడుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అనసూయకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి లైవ్ లో నడిచిన వివాదాన్ని రీల్ లైఫ్ లో వాడేసుకున్నారు డైరెక్టర్.

అనసూయ టూ వీలర్ పై వస్తుంటే ఒకతను బండి తుడడానికి వచ్చి.. అక్క, నీకు మహేష్ బాబు లాంటి మొగుడు వస్తాడు అక్క అని అంటాడు. దాంతో మొహం కొంచెం అదోలా పెట్టుకుంటుంది. వెంటనే అక్క నీకు విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడు అక్క అంటాడు.. అనసూయ వెంటనే నవ్వు ముఖంతో కనిపిస్తుంది.. ఇలా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అనసూయ రియల్ లైఫ్ లో నడిచిన వివాదాన్ని ఇలా రీల్ లైఫ్ లో వాడేసుకున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ – అన‌సూయ మ‌ధ్య న‌డిచిన వివాదం గుర్తుండే ఉంటుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా వ‌చ్చిన‌ప్పుడో, త‌ను మీడియాలో హాట్ టాపిక్ గా మారిన‌ప్పుడో అన‌సూయ‌తో గొడ‌వ తెర‌పైకి మీడియా తీసుకొస్తుంటుంది. అన‌సూయ మీడియా ముందుకు వ‌చ్చినా ఇదే ప్ర‌శ్న రిపీట్ అవుతుంటుంది. సింబా సినిమా ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా విజ‌య్ తో గొడ‌వ స‌మ‌సిపోయిందా? అనే టాపిక్ మ‌ళ్లీ వ‌చ్చింది. దానిపై అన‌సూయ రియాక్ట్ అయ్యింది. విజ‌య్ స్టేజ్ మేన‌ర్స్ పైనే ఆరోజు తాను గొంతు విప్పాన‌ని, లైమ్ లైట్ లో ఉన్న‌ప్పుడు ప‌ద్ధ‌తిగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, దాని గురించే తాను మాట్లాడాల్సివ‌చ్చింద‌ని, నిజానికి ఇది మీడియా బాధ్య‌త అని, మీడియా మాట్లాడ‌క‌పోవ‌డం వ‌ల్లే ఆరోజు తాను స్పందించాల్సివ‌చ్చింద‌ని, అయితే ఈ ఇష్యూతో తాను కూడా కొంత నేర్చుకొన్నాన‌ని, త‌ను చెప్పాల్సిన విష‌యాన్ని స‌రిగ్గా క‌న్వే చేస్తే బాగుండేద‌ని అన‌సూయ పేర్కొంది. ప్ర‌స్తుతానికైతే విజ‌య్ తో ఎలాంటి గొడ‌వ‌లూ లేవంది.