Movie News

బెట్టింగ్ యాప్ లో అడ్డంగా దొరికిన ఆయ్ టీం..అసలు ఏంజరిగిందంటే..

ఇటీవల సినిమా యూనిట్స్ తమ సినిమాల ప్రమోషన్ ను చాల డిఫరెంట్ గా చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. రెగ్యులర్ ప్రెస్ మీట్ లు , ప్రీ రిలీజ్ వేడుకలు పెడితే అసలు పట్టించుకోవడం లేదు..ఏదైనా వివాదాస్పదంగా ఉంటేనే ఆ సినిమాకు ప్రమోషన్ పెరుగుతుంది..సినిమా ఫై ఆసక్తి కొనసాగుతుంది. ఈ తరుణంలో ఆయ్ టీం వినూత్నంగా ప్రమోషన్ చేసి వార్తల్లో నిలిచారు.

అంజిత్ కొయ్య, రాజ్ కుమార్ కసిరెడ్డి కలసి నటిస్తున్న తాజా మూవీ ఆయ్. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాను ఆగస్టు 15న థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం చేసిన ప్రమోషనల్ స్టంట్ వైరల్ గా మారింది. ఓ ఫ్లాట్ లో ఇద్దరూ బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు వచ్చి వీరిద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నట్టుగా ఆ వీడియోలో ఉంది.

అంతేకాకుండా అదే సమయంలో రాజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఏడాదికాలంగా సినిమాను తీస్తున్నా ప్రమోషన్స్ విషయాన్ని నిర్మాత బన్నీ వాస్ పట్టించుకోవట్లేదని చెప్పాడు. అందుకే తనను పోలీసులు అరెస్టు చేశారని చెప్పామని, ఇప్పుడు ఆయన మా కోసం వస్తాడంటూ ఇది సినిమా ప్రమోషన్ అనే చావు కబురు చల్లగా చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అవుతుండగా, చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెట్టింగ్ రైడ్ లో అడ్డంగా దొరికిపోయిన ఆయ్ టీం అనే వార్త క్షణంలో వైరల్ కావడంతో పాటు వివాదానికి దారి తీసింది. చాలామంది ఇలా సినిమాల కోసం జనాలను పిచ్చోళ్లను చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మండి పడుతున్నారు.