Home Movie News 20 కోట్ల బడ్జెట్‌తో 35 రోజుల భారీ క్లైమాక్స్‌ షూటింగ్

20 కోట్ల బడ్జెట్‌తో 35 రోజుల భారీ క్లైమాక్స్‌ షూటింగ్

0
20 కోట్ల బడ్జెట్‌తో 35 రోజుల భారీ క్లైమాక్స్‌ షూటింగ్

మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ పాన్-ఇండియా స్పెక్టికల్ SYG (సంబరాల ఏటిగట్టు) తో ఇంతకు ముందెన్నడూ చూడని ఎక్స్ పీరియన్స్ అందించడానికి సిద్ధమవుతున్నాడు. రోహిత్ కెపి దర్శకత్వంలో పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ హనుమాన్ అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నెక్స్ట్ లెవల్ లో  రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన అసుర ఆగమన గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

టీం ప్రస్తుతం భారీ, హై-ఆక్టేన్ క్లైమాక్స్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తోంది. మేకర్స్ క్లైమాక్స్ కోసం ప్రత్యేకంగా 20 కోట్లకు పైగా కేటాయించారు. 35 రోజుల షెడ్యూల్ జరుగుతోంది, ఇందులో 18 భారీ యాక్షన్ బ్లాక్‌లు ఉన్నాయి, ప్రముఖ స్టంట్ డైరెక్టర్ కెవిన్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

యుద్ధభూమిని తలపించేలా రూపొందించిన క్లైమాక్స్ మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం గుర్తు చేసేలా ఉండబోతుంది. ప్రేక్షకులకు రా, ఇమర్సివ్, విజువల్‌గా గ్రాండియర్ అనుభూతిని అందించేలా ఈ క్లైమాక్స్‌ను మలిచారు.

సాయి దుర్గా తేజ్ ఈ చిత్రానికి పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇంటెన్స్, ఫియర్స్ మేకోవర్‌తో పాటు ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల కోసం హై-రిస్క్ స్టంట్స్‌ను స్వయంగా చేస్తూ, తన కెరీర్‌లో ఇప్పటివరకు  మోస్ట్ ఛాలెంజింగ్ గా నిలిచిన పాత్రలో కనిపించబోతున్నారు.

టాప్ టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి పని చేస్తోంది. సినిమాటోగ్రఫీని వెట్రివేల్ పళనిసామి అందిస్తుండగా, సంగీతాన్ని బి. అజనీష్ లోకనాథ్ సమకూరుస్తున్నారు. ఎడిటింగ్‌ను నవీన్ విజయకృష్ణ నిర్వహిస్తుండగా, ప్రొడక్షన్ డిజైన్‌ను గాంధీ నడికుడికర్ రూపొందిస్తున్నారు. ప్రతి విభాగంలోనూ అత్యుత్తమ నైపుణ్యంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ పాన్-ఇండియా విడుదలకు సిద్ధమవుతున్న “సంబరాల ఏటిగట్టు” ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్ సినిమాటిక్ ఈవెంట్ గా నిలుస్తోంది.