సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న థ్రిల్లింగ్ ‘కామాఖ్య’. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ PVT LTD బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ రోజు ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సినిమా ప్రారంభోత్సవానికి మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఈ వేడుకలో మూవీ టీం అందరూ పాల్గొన్నారు.
డైరెక్టర్ అభినయ కృష్ణ ఈ సినిమా కోసం మిస్టీరియస్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ యూనిక్ కథని సిద్ధం చేశారు.

ఈ చిత్రంలో ఆనంద్, శరణ్య ప్రదీప్,వైష్ణవ్, ధనరాజ్, రాఘవ, ఐశ్వర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి గ్యాని సంగీతం అందిస్తున్నారు. రమేష్ కుశేందర్ రెడ్డి డీవోపీగా వర్క్ చేస్తున్నారు. భూపతి యాదగిరి ఆర్ట్ డైరెక్టర్.
ఈచిత్రానికి సంబధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.